సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారానికి సంబంధించిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుకానున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు కేటీఆర్ వ్యక్తిగతంగా హాజరుకానున్నారు.
ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో నిధుల వినియోగం, పరిపాలనా నిర్ణయాలకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్టు ముందు విచారణ జరగనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కేటీఆర్ హాజరు అనంతరం కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.


