
కర్నూలు (టౌన్): ‘పవన్.. సినిమా డైలాగులు చెప్పి, డ్యాన్సులు చేస్తే ఓట్లు రాలవు. రాష్ట్రంలో 3 శాతం ఓట్లులేని జనసేనకు 30 శాతం ఓటు బ్యాంకు ఉన్నట్లు కొన్ని మీడియా చానళ్లు వక్రీకరిస్తున్నాయి. ప్యాకేజీ స్టార్.. ప్యాకేజీకి అమ్ముడుపోవద్దు..’ అని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె.ఎ.పాల్ అన్నారు.
ఆయన సోమవారం కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో నాటి, నేటి ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పారు. తన రాజకీయంపై పవన్కళ్యాణ్కే క్లారిటీ లేదన్నారు.