నాడు ఈడీ అరెస్ట్‌.. నేడు మోదీతో సీఎం సొరేన్‌ భేటీ | Jharkhand Chief Minister Hemant Soren Meets PM Modi | Sakshi
Sakshi News home page

నాడు ఈడీ అరెస్ట్‌.. నేడు మోదీతో సీఎం సొరేన్‌ భేటీ

Jul 15 2024 4:34 PM | Updated on Jul 15 2024 4:51 PM

Jharkhand Chief Minister Hemant Soren Meets PM Modi

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, హేమంత్‌ సొరేన్‌ మరోసారి జార్ఖండ్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానిని కలవడం ఇదే తొలిసారి.

కాగా, మోదీని సీఎం హేమంత్‌ సొరేన్‌ మర్యాదపూర్వంగా కలిసినట్టు ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పష్టం చేశారు. ఇక, జార్ఖండ్‌లో ల్యాండ్‌ స్కామ్‌కు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) హేమంత్‌ సొరేన్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

 

 

ఈ క్రమంలో జనవరి 31వ తేదీన సీఎం పదవికి సొరేన్‌ రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఇటీవలే జార్ఖండ్‌ కోర్టు హేమంత్‌ సొరేన్‌కు బెయిల్‌ ఇవ్వడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. అనంతరం, మళ్లీ జార్ఖండ్‌ సీఎంగా ప్రమాణం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement