EC Office: పార్లమెంట్‌ వద్ద ఉద్రిక్తత.. రాహుల్‌ సహా ఎంపీలు అరెస్ట్‌ | INDIA bloc leaders Parliament to Election Commission march Updates | Sakshi
Sakshi News home page

EC Office: విపక్ష ఎంపీల ర్యాలీ అప్‌డేట్స్‌..

Aug 11 2025 11:56 AM | Updated on Aug 11 2025 12:46 PM

INDIA bloc leaders Parliament to Election Commission march Updates

INDIA bloc leaders March Updates..

ఎంపీలు అరెస్ట్‌.. 

  • పార్లమెంట్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. 
  • రాహుల్‌ గాంధీ సహా ప్రతిపక్ష పార్టీ ఎంపీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
  • ఇండియా కూటమి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
  • కూటమి ఎంపీలను అరెస్ట్‌ చేసి బస్సుల్లో తరలిస్తున్న పోలీసులు. 
  • కేంద్ర ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా ఎంపీల నినాదాలు.

 

రాహుల్‌ కామెంట్స్‌..

  • అరెస్ట్‌ తర్వాత రాహుల్‌ మాట్లాడుతూ..
  • నిజం దేశం ముందు ఉంది.
  • కానీ, వాస్తవం ఏమిటంటే వారు మాట్లాడలేరు.
  • ఈ పోరాటం రాజకీయమైనది కాదు.
  • ఈ పోరాటం రాజ్యాంగాన్ని కాపాడటానికి చేస్తున్నాం.
  • ఈ పోరాటం ఓటు కోసం.
  • మాకు స్వచ్ఛమైన ఓటర్ల జాబితా కావాలి

కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేష్‌ కామెంట్స్‌..

  • కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మాట్లాడుతూ..
  • ఎన్నికల కమిషన్‌కు నేను రాసిన లేఖ ప్రత్యక్షంగా ఉంది.
  • అన్ని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంటు నుండి ఈసీ ఆఫీసుకు శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తారని నేను స్పష్టంగా రాశాను.
  • ఎంపీలందరూ SIR గురించి ఎన్నికల కమిషన్‌కు ఒక డాక్యుమెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.
  • ఇది మా డిమాండ్.
  • నేను నిన్న సాయంత్రం ఈ లేఖ రాశాను.
  • ఇప్పుడు వారు 30 మంది ఎంపీలు మాత్రమే రావాలని అంటున్నారు.
  • ప్రతిపక్ష ఎంపీలందరూ సమిష్టిగా ఈసీకి ఒక డాక్యుమెంట్ ఇవ్వాలని మేము కోరుకున్నాం.
  • మమ్మల్ని ఇక్కడే ఆపారు.
  • ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లడానికి అనుమతించడం లేదు.

 

శశి థరూర్ కామెంట్స్‌..

  • కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ..
  • ఈ విషయం చాలా సులభం.
  • రాహుల్ గాంధీ కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు.
  • వాటికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది.
  • ఎన్నికల కమిషన్ దేశం పట్ల బాధ్యత వహించడమే కాదు.  
  • మన ఎన్నికల విశ్వసనీయత గురించి ప్రజల మనస్సులలో సందేహాలను నివృత్తి చేయాలి.
  • ఈసీకి ఆ బాధ్యత ఉంది.
  • ఎన్నికలు మొత్తం దేశానికి ముఖ్యమైనవి.
  • నకిలీ ఓటింగ్ ఉందా, బహుళ చిరునామాలు ఉన్నాయా లేదా నకిలీ ఓట్లు ఉన్నాయా?.
  • పలు సందేహాలతో మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది.
  • ప్రజల మనస్సులలో సందేహాలు ఉంటే వాటిని పరిష్కరించాలి.
  • ఈ ప్రశ్నలకు సమాధానాలు అందుబాటులో ఉండవచ్చు, కానీ ఆ సమాధానాలను విశ్వసనీయంగా అందించాలి.
  • ఎన్నికల కమిషన్ ప్రశ్నలను తీసుకొని వాటిని పరిష్కరించాలి. 
     

పార్లమెంట్‌ వద్ద ఉద్రిక్తత.. 

  • సంసద్‌ మార్గ్‌ను బ్లాక్‌ చేసిన పోలీసులు.
  • ఈసీ ఆఫీసుకు వెళ్లకుండా విపక్ష ఎంపీలను అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు.
  • బారికేడ్డు పెట్టి విపక్ష ఎంపీలను నిలువరిస్తున్న ఢిల్లీ పోలీసులు.
  • ఓట్ల చోరీపై ఎన్నికల సంఘానికి సవాల్‌ చేసిన రాహుల్‌ గాంధీ. 
  • రోడ్డుపై బైఠాయించి ఎంపీల నిరసనలు.. 

ఢిల్లీలో హైటెన్షన్‌.. అఖిలేష్‌ యాదవ్‌ నిరసన..

  • ఎంపీల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.
  • బారికేడ్ల దూకి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన అఖిలేష్‌.
  • అఖిలేష్‌ను అడ్డుకున్న పోలీసులు..
  • పార్లమెంట్‌ వద్ద రోడ్డుపై కూర్చుని అఖిలేష్‌, తృణముల్‌ ఎంపీలు నిరసనలు.
  • నిరసనల్లో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే, శరద్‌ పవార్‌, శశి థరూర్‌ 
  • పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతల నినాదాలు 

 

 

 

 

పార్లమెంట్‌ వద్ద ఉ‍ద్రికత్త..

 

  • పార్లమెంట్‌ బయటే బారికేడ్ల ఏర్పాటు.
  • బారికేడ్లపైకి ఎక్కిన మహిళా ఎంపీలు.
  • ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులు. 

ఎంపీల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు..

  • ఈసీ అపాయింట్‌మెంట్‌ కోరిన ప్రతిపక్ష నేతలు
  • పార్లమెంట్‌ టు ఈసీ.. విపక్ష ఎంపీల ర్యాలీ
  • బీహార్‌లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా విపక్ష పార్టీలకు చెందిన ఎంపీల ర్యాలీ
  • కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ర్యాలీ
  • గత లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ నినాదాలు
  • ఈ ర్యాలీకి అనుమతి లేదన్న ఢిల్లీ పోలీసులు
  • 30 మందే రావాలంటూ జైరాం రమేష్‌కు లేఖ రాసిన ఈసీ.
  • ఓట్ల చోరీపై ఎన్నికల సంఘానికి రాహుల్‌ గాంధీ సవాల్‌. 
  • 300 మంది ఎంపీలతో ర్యాలీకి ఇండియా కూటమి ప్రయత్నం 


👉విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్‌ నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. బీహార్‌లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఈ ర్యాలీ కొనసాగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌, ఇండియా బ్లాక్‌ నేతలు, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement