ఒవైసీ, కేసీఆర్‌ కలిసి బిర్యానీ తింటారు | GHMC Elections 2020: Owaisi and KCR Eat Biryani Together Kishan Reddy Says | Sakshi
Sakshi News home page

ఒవైసీ, కేసీఆర్‌ కలిసి బిర్యానీ తింటారు

Dec 5 2020 5:56 PM | Updated on Dec 5 2020 7:16 PM

GHMC Elections 2020: Owaisi and KCR Eat Biryani Together Kishan Reddy Says - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, ఎంఐఎం రహస్య పొత్తు పెట్టుకున్నాయమని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి మరోసారి ఆరోపించారు. మేయర్‌ ఎన్నికతో వారి బండారం బయటపడుతుందని చెప్పారు. గ్రేటర్‌ ఎన్నికల్లో నగర ఓటరు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. టీఆర్ఎస్-55, బీజేపీ-48, ఎంఐఎం-44, కాంగ్రెస్-2 స్థానాల్లో విజయం సాధించింది. మేయర్‌ పీఠం కోసం ఎంఐఎంతో టీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకుంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో శనివారం ఈ అంశంపై కిషన్‌ రెడ్డి వ్యగ్యంగా స్పందించారు. ‘కేసీఆర్‌, అసదుద్దీన్‌ ఒవైసీ కలిసి బిర్యానీ తింటారు’ అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
(చదవండి : బీజేపీ గెలుపు తాత్కాలికమే : ఒవైసీ)

‘హైదరాబాద్‌ ఒక మిని తెలంగాణ. అక్కడ ప్రజలు బీజేపీకి 48 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ ఫలితాలు అధికార టీఆర్‌ఎస్‌కు చెంపపెట్టు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందని తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఒవైసీ కానీ, కేసీఆర్‌ ఆపలేరు’ అని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement