ఆప్‌ ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ ఆనంద్‌పై అనర్హత వేటు | Former Mla Raaj Kumar Anand Disqualified For Defection | Sakshi
Sakshi News home page

ఆప్‌ ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ ఆనంద్‌పై అనర్హత వేటు

Jun 14 2024 8:08 PM | Updated on Jun 14 2024 8:20 PM

Former Mla Raaj Kumar Anand Disqualified For Defection

సాక్షి, ఢిల్లీ: ఆప్‌ ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ ఆనంద్‌పై అనర్హత వేటు పడింది. బీఎస్పీ తరపున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన రాజ్‌కుమార్‌.. విచారణకు హాజరుకావాలని స్పీకర్‌ ఆదేశించారు. విచారణకు హాజరుకాకపోవడంతో రాజ్‌కుమార్‌ అసెంబ్లీ సభ్యత్వంపై అనర్హత వేటు వేసినట్టు స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ శుక్రవారం తెలిపారు. 

జూన్ 11న  విచారణకు హాజరుకావాలని నోటీస్‌ ఇచ్చినా కానీ ఆయన హాజరుకాలేదని గోయెల్ పేర్కొన్నారు. మరోసారి జూన్ 14న హాజరుకావాలని ఆదేశించినా స్పందించలేదన్నారు. ఈ క్రమంలో ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు స్పీకర్ తెలిపారు.

'ఆప్' సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వంలో పలు మంత్రిత్వ శాఖలను రాజ్‌కుమార్‌ ఆనంద్ నిర్వహించారు. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దళితులకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ.. గత ఏప్రిల్‌లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీని కూడా వీడారు. ఆప్‌లోని దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు, కౌన్సిలర్లకు ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. గత మేలో బీఎస్పీలో చేరారు. బీఎస్పీ తరఫున ఎంపీ ఎన్నికల్లో రాజ్‌కుమార్‌ పోటీ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement