షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్కుమార్ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాలింపు బృందాల సంఖ్యను 10 నుంచి 12కు పెంచారు. అయినప్పటికీ నిందితుడు జాడ తెలియరాలేదు.
అయితే, ఈ క్రమంలో ఆరుగురు హత్య తర్వాత రాజ్కుమార్ ఆత్మహత్యకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పట్టాలపై నిలబడి రైలు రాగానే మనసు మార్చుకొని పరారైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక ఆ ఆరు హత్యలు పక్కా పథకంతోనే చేసినవేనని పోలీసులు గుర్తించారు. రాజ్కుమార్ నాలుగు ఫోన్లలో.. 16 సిమ్కార్డులు ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.


