breaking news
Defection Act
-
ఆప్ ఎమ్మెల్యే రాజ్కుమార్ ఆనంద్పై అనర్హత వేటు
సాక్షి, ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే రాజ్కుమార్ ఆనంద్పై అనర్హత వేటు పడింది. బీఎస్పీ తరపున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన రాజ్కుమార్.. విచారణకు హాజరుకావాలని స్పీకర్ ఆదేశించారు. విచారణకు హాజరుకాకపోవడంతో రాజ్కుమార్ అసెంబ్లీ సభ్యత్వంపై అనర్హత వేటు వేసినట్టు స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ శుక్రవారం తెలిపారు. జూన్ 11న విచారణకు హాజరుకావాలని నోటీస్ ఇచ్చినా కానీ ఆయన హాజరుకాలేదని గోయెల్ పేర్కొన్నారు. మరోసారి జూన్ 14న హాజరుకావాలని ఆదేశించినా స్పందించలేదన్నారు. ఈ క్రమంలో ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు స్పీకర్ తెలిపారు.'ఆప్' సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వంలో పలు మంత్రిత్వ శాఖలను రాజ్కుమార్ ఆనంద్ నిర్వహించారు. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దళితులకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ.. గత ఏప్రిల్లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీని కూడా వీడారు. ఆప్లోని దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు, కౌన్సిలర్లకు ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. గత మేలో బీఎస్పీలో చేరారు. బీఎస్పీ తరఫున ఎంపీ ఎన్నికల్లో రాజ్కుమార్ పోటీ చేశారు. -
టీఆర్ఎస్ తీరు అప్రజాస్వామికం
కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్: ‘రాష్ట్ర శాసనసభలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. విపక్ష సభ్యులను గౌరవించకుండా, వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నిర్ధాక్షిణ్యంగా ప్రవర్తిస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే స్పీకర్ దృష్టికి తీసుకు వెళ్లాం..’ అని టీపీసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై చర్చించేలా సమయం ఇవ్వాలని మరో మారు స్పీకర్ను కోరదలిచాం అని తెలిపారు. అలాగే, ఒక పార్టీ తరపున గెలిచిన వారిపై ఒత్తిళ్లు పెట్టి తమ పార్టీలో చేర్చుకునే దుష్ట సంప్రదాయాన్ని టీఆర్ఎస్ మొదలు పెట్టిందని విమర్శించారు. ఇలాంటి వారిపై చర్య తీసుకోవాలని స్పీకర్ను కోరామన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం మేరకు వారి సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆలస్యమైందని, మరోమారు స్పీకర్ను కలిసి వివరిస్తామని చెప్పారు. పార్టీ మారిన సభ్యులు ఏకంగా అధికార పక్షానికి చెందిన బ్లాక్లో కూర్చుంటున్నారని, ఇదే పెద్ద ఆధారమని అన్నారు. చర్యలు తీసుకోకుంటే, ప్రత్యామ్నాయ మార్గాలు వెదుక్కుంటామని, కానీ, పరిస్థితి అంతదాకా వస్తుందని అనుకోవడం లేదన్నారు. తమ పార్టీకి చెందిన విఠల్రెడ్డి, కనకయ్య, రెడ్యానాయక్ పార్టీ మారారని, రెడ్యానాయక్ మాత్రం అధికార పక్షం బ్లాక్లో కూర్చుని మాట్లాడారని చెప్పారు. వీరిపై చర్య తీసుకోవాల్సిందేనని భట్టి డిమాండ్ చేశారు.