ప్రధాని, అదానీ కలిసి దేశం పరువు తీశారు: సీఎం రేవంత్‌ | Congress Leaders Chalo Raj Bhavan Program In Telangana | Sakshi
Sakshi News home page

ప్రధాని, అదానీ కలిసి దేశం పరువు తీశారు: సీఎం రేవంత్‌

Dec 18 2024 7:21 AM | Updated on Dec 18 2024 2:20 PM

Congress Leaders Chalo Raj Bhavan Program In Telangana

Congress Chalo Raj Bhavan Updates..

రాజ్‌భవన్‌ వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌ మాట్లాడుతూ..

  • ప్రధాని, అదానీ అనుబంధం మన దేశ ప్రతిష్టను దెబ్బ తీస్తోంది
  • దేశంలో వ్యాపారం చేయాలంటే లంచం ఇచ్చే పరిస్థితిని తెచ్చారు
  • అదానీ, ప్రధాని కలిసి దేశం పరువు తీశారు
  • జేపీసీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది
  • అదానీ విషయంలో ప్రధానిని అడిగినా, కడిగినా కనీసం మాట్లాడడం లేదు. 
  • ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌ వద్దకు నిరసన ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. 
  • మా నిరసన కొందరికి నచ్చకపోవచ్చు. 75 ఏళ్ల కష్టపడి కాంగ్రెస్‌.. దేశ ప్రతిష్టను పెంచింది. 
  • ప్రధాని, అదానీ కలిసి దేశం పరువు తీస్తున్నారు.
  • అదానీ లంచాలు ఇచ్చారని అమెరికా సంస్థలు తేల్చాయి.
  • ఈ విషయంలో అదానీపై అమెరికాలో కేసు నమోదైంది.
  • ఈ అంశంపై పార్లమెంట్‌లో రాహుల్‌ గాంధీ నిలదీశారు.
  • కానీ, దీనిపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు.
  • మమ్మల్ని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే నిరసన చేపడుతున్నాం.
  • అదానీపై విచారణ జరగాలి.
  • అదానీ అంశంపై జేపీసీ వేయాలని ఖర్గే డిమాండ్‌ చేశారు.
  • కానీ, కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.
  • దీనిపై అవసరమైతే రాష్ట్రపతిభవన్‌ వద్ద కూడా నిరసనలు తెలుపుతాం.
  • విధిలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయిన నేను కూడా నిరసనల్లో పాల్గొనాల్సి వచ్చింది.
  • ప్రజాస్వామ్యాన్ని, పప్రజా ధనాన్ని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది.
  • నక్కలా బీఆర్‌ఎస్‌ వ్యవహరిస్తోంది.
  • నేను ధర్నా చేయను.. మరి బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తారా?.
  • తన విధానమేంటో బీఆర్‌ఎస్‌ చెప్పాలి.
  • అదానీ విషయంలో కేంద్రాన్ని నిలదీయాలా వద్దా చెప్పండి.
  • ఢిల్లీలో బీజేపీ పెద్దలతో బీఆర్‌ఎస్‌ను అనుబంధం ఉంది.
  • అందులో భాగంగానే అదానీ అవినీతిపై బీఆర్‌ఎస్‌ మాట్లాడటం లేదు.
  • బీఆర్‌ఎస్‌ నేతలు రెడీ అంటే అసెంబ్లీలో తీర్మానం చేద్దాం.. బీఆర్‌ఎస్‌ నేతలు వస్తారా?.

  •  

👉రాజ్‌భవన్‌ వద్ద రోడ్డుపై సీఎం రేవంత్‌, భట్టి, కాంగ్రెస్‌ నేతలు బైఠాయింపు..

  • నిరసనలు తెలుపుతున్న కాంగ్రెస్‌ నేతలు..
  • కాసేపట్లో గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వనున్న హస్తం నేతలు.
  • అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్‌ అల్లర్ల విషయంలో ప్రధాని మౌనంపై నిరసనలు.
  • ఏఐసీసీ పిలుపుతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళనలు. 
     

👉టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నిరసనల్లో సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. 

👉నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం అక్కడి నుంచి కాంగ్రెస్‌ నేతలు రాజ్‌భవన్‌కు బయలుదేరారు.  

👉అక్కడి నుంచి రాజ్‌భవన్‌ వరకు కాంగ్రెస్‌ నేతలు ర్యాలీగా వెళ్లనున్నారు.

👉దేశంలో అదానీ, మణిపూర్‌ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంపై ఏఐసీసీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అమెరికాలో గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార, ఆర్థిక రంగాన్ని, పరువును దెబ్బతీశాయని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. అవినీతి, మోసం, మనీలాండరింగ్, మార్కెట్ మానిప్యులేషన్ లాంటి అంశాలలో అదానీ  దేశ ప్రతిష్టను దెబ్బతీశారని తీవ్ర విమర్శలు చేశారు. మణిపూర్‌లో వరుసగా జరిగిన అల్లర్లు, విధ్వంసాలపై మోదీ స్పందించకపోవడంపై కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ ర్యాలీలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్‌ మున్షీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement