ముగ్గురు కీలక నేతలతో సీఎం మమత భేటీ.. ఏం చర్చించనున్నారు? | CM Mamata Banerjee Will Meets Uddhav Thackeray And Sharad Pawar, More Details Inside | Sakshi
Sakshi News home page

ముగ్గురు కీలక నేతలతో సీఎం మమత భేటీ.. ఏం చర్చించనున్నారు?

Jul 11 2024 3:58 PM | Updated on Jul 11 2024 4:37 PM

CM Mamata Banerjee Will Meets Uddhav Thackeray And Sharad Pawar

కోల్‌కత్తా: దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. రేపు(శుక్రవారం)  ఉద్దవ్‌ థాక్రే, శరద్‌ పవార్‌ను ముంబై కలవనున్నట్టు ఆమె చెప్పారు. వీలైతే అఖిలేష్‌ యాదవ్‌ను కూడా కలిసే ఛాన్స్‌ ఉందన్నారు.

కాగా, సీఎం మమతా బెనర్జీ గురువారం మాట్లాడుతూ.. వ్యాపారవేత్త ముఖేష్‌ అంబానీ కుమారుడు వివాహం కోసం నేను ముంబై వెళ్తున్నాను. ఇదే సమయంలో రేపు(శుక్రవారం)  శివసేన నేత ఉద్దవ్‌ థాక్రే, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌తో సమావేశం కాబోతున్నాను. ఈ సందర్భంగా దేశ రాజకీయాలపై చర్చించబోతున్నాము. లోక్‌సభ ఎన్నికల తర్వాత మొదటిసారిగా మేము భేటీ అవుతున్నాము. రేపటి భేటీకి అఖిలేష్‌ యాదవ్‌ కూడా వచ్చే ఛాన్స్‌ ఉంది అని చెప్పుకొచ్చారు.

 

ఇదిలా ఉండగా.. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉన్న పార్టీ నేతలతో భేటీ కావడం నేపథ్యంలో ప్రాధాన్యత చోటుచేసుకుంది. వీరి సమావేశంలో ఏం చర్చిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement