చంద్రబాబు అసహనం.. జనానికి మళ్లీ క్లాస్‌ పీకేశారు..! | Chandrababu Class To People At PRajavadika Muppala NTR District | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అసహనం.. జనానికి మళ్లీ క్లాస్‌ పీకేశారు..!

Apr 5 2025 6:37 PM | Updated on Apr 5 2025 7:49 PM

Chandrababu Class To People At PRajavadika Muppala NTR District

ఎన్టీఆర్ జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి అసహనం వ్యక్తం చేశారు.  ఎన్టీఆర్ జిల్లాలో ముప్పాలలో  ఏర్పాటు  చేసిన ప్రజావేదికలో భాగంగా చంద్రబాబు ప్రసంగం మొదలవ్వగానే జనం వెళ్లిపోయిందేకు సిద్ధమయ్యారు.  ఇది చూసి చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తూ, అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ క్రమంలోనే చంద్రబాబు వారికి క్లాస్ పీకారు.

‘ మిమ్మల్ని చూస్తుంటే ఒక సామెత గుర్తుకొస్తుంది.. గుర్రాన్ని తొట్టె దగ్గరగా తీసుకువెళ్లగలం కానీ నీరు తాగింలేం కదా’ అంటూ సామెత చెప్పుకొచ్చారు.  ఇప్పుడు మీ తీరు కూడా ఇలానే ఉందన్నారు. ‘మీకోసం నేను అన్ని పనులు వదిలేసుకుని 2:30 అవుతున్నా భోజనం కూడా చేయకుండా ఉన్నా. నేను చెప్పేది అర్ధం చేసుకోండి. నేను చెప్పేది మీరు అర్ధం చేసుకోవాలి. ఆపై కార్యాచరణ స్పూర్తిదాయకంగా ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది’ అంటూ ప్రసంగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement