రాహుల్‌ గాంధీ క్షమాపణలు చెబుతారా?: రవిశంకర్‌ప్రసాద్‌ | Bjp Ravishankarprasad Demands Apology From Rahulgandhi | Sakshi
Sakshi News home page

రాహుల్‌ గాంధీ క్షమాపణలు చెబుతారా?: రవిశంకర్‌ప్రసాద్‌

Jul 24 2024 3:38 PM | Updated on Jul 24 2024 4:11 PM

Bjp Ravishankarprasad Demands Apology From Rahulgandhi

న్యూఢిల్లీ: నీట్‌ పరీక్షను రద్దు చేయబోమని సుప్రీంకోర్టు స్పష్టంచేయడం అధికారపక్షానికి ఆయుధంగా మారింది. ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై బీజేపీ విమర్శలు గుప్పించింది. దేశంలో మొత్తం పరీక్షా విధానంపై రాహుల్‌ ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగిస్తున్నారని బీజేపీ సీనియర్‌నేత రవిశంకర్‌ ప్రసాద్‌ విమర్శించారు.

పరీక్షా విధానంపై తాను చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ రాహుల్‌ క్షమాపణలు చెబుతారా అని ప్రశ్నించారు. దేశంలోని పరీక్షా విధానాల్లో మోసం జరుగుంతోందంటూ రాహుల్‌ ఆరోపించారని ప్రసాద్‌ గుర్తుచేశారు. ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తూ రాహుల్‌ దేశంలోని విద్యావ్యవస్థ పరువు తీయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ హయాంలో ఎన్నోసార్లు పేపర్‌ లీకులు జరిగాయన్నారని విమర్శించారు. నీట్‌ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఇకనైనా రాహుల్‌ ఇటువంటి అసత్య ప్రచారాలను మానుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement