‘డ్రామాలు చేసున్న వారంతా పట్టుబడ్డారు’

AP Speaker Tammineni Sitaram Comments On Amaravati Farmers Padayatra - Sakshi

స్పీకర్‌ తమ్మినేని సీతారాం

సాక్షి, శ్రీకాకుళం జిల్లా: రైతుల పేరుతో బినామీ యాత్ర చేస్తున్నారని స్పీకర్‌ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వెరిఫికేషన్‌లో 70 మంది మాత్రమే అసలు రైతులని తేలిందని, డ్రామాలు చేస్తున్న వారంతా పట్టుబడ్డారన్నారు.
చదవండి: అంతా పక్కా స్క్రిప్ట్.. అసలు కారణం ఇదన్న మాట..

‘‘అమరావతి ఉద్యమం కలుషితమైన ఉద్యమం. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కచ్చితంగా జరిగింది. విశాఖ ప్రపంచ నగరం. అమరావతిలా గ్రాఫిక్స్‌ కాదు. వెనుకబాటుతనాన్ని పారద్రోలడం కోసమే ఉత్తరాంధ్రకు రాజధాని. విశాఖ రాజధాని ఏర్పాటుకు తోడ్పడాలని, న్యాయస్థానాలు, న్యాయమూర్తులను కోరుతున్నా’’ అని తమ్మినేని అన్నారు. రాజకీయ నేతకు ఉండాల్సిన లక్షణాలు పవన్‌ కల్యాణ్‌కు లేవు. ఓ నాయకుడు చెప్పు పట్టుకుని స్టేజ్‌ మీద చూపడమేంటి?’’ అని స్పీకర్‌ ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top