జగన్‌ పిటిషన్‌.. స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు | AP High Court Hearing On YS Jagan Petition To Grant Opposition Status | Sakshi
Sakshi News home page

జగన్‌ పిటిషన్‌.. స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు

Jul 30 2024 11:57 AM | Updated on Jul 30 2024 12:24 PM

AP High Court Hearing On YS Jagan Petition To Grant Opposition Status

సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష హోదా కల్పించాలని వైఎస్సార్‌సీపీ అధినేత, ఆ పార్టీ శాసన సభాపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిటిషన్‌పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. కక్షపూరితంగా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వటం లేదని వైఎస్‌ జగన్‌ తరఫున న్యాయవాది తన వాదనను వినిపించారు.

ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్‌కు వైఎస్ జగన్ రిప్రజెంటేషన్‌ ఇచ్చారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా, గత నెల 24న ఇచ్చారని కోర్టుకు వైఎస్‌ జగన్‌ తరఫున న్యాయవాది తెలిపారు. అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్ కార్యదర్శికి కోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ మూడు వారాలకు విచారణను కోర్టు వాయిదా వేసింది.

కాగా, శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి 11 సీట్లు వచ్చా­యన్న కారణంతో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా, తనకు ప్రతిపక్ష పార్టీ నేత హోదా ఇచ్చే విషయంలో స్పీకర్‌ నాన్చుడు ధోరణి ప్రదర్శి­స్తున్నా­రని, ప్రతి­పక్ష హోదా ఇచ్చే ఉద్దేశం లేనందునే ఇలా చేస్తు­న్నా­రంటూ వైఎస్‌ జగన్‌ ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement