'స్మార్ట్‌గా సోషల్‌ వార్‌..' రాజకీయ పార్టీల ప్రచారం..!

- - Sakshi

ఎన్నికల ప్రచారానికి వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ యాప్‌లను వినియోగించుకుంటున్న రాజకీయ పార్టీలు..

యూట్యూబ్‌ లింక్‌లు, లైవ్‌లద్వారా ప్రచార కార్యక్రమాలు!

పంచ్‌ డైలాగ్‌లతో వీడియోలు చేసి వైరల్‌ చేస్తున్న వైనం..

ఇందుకోసం క్షేత్రస్థాయిలో జీతాలు ఇచ్చి మరీ సిబ్బంది నియామకం!

మరోవైపు ప్రచారం నేపథ్యంలో సమస్యలపై నిలదీస్తున్న యువత..

సాక్షి, నిజామాబాద్‌: సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారం చేస్తున్నప్పటికీ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి స్మార్ట్‌ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడం గమనార్హం. ప్రజల నుంచి సైతం సోషల్‌ మీడియా ప్రచారానికి ఎక్కువ ఆసక్తి కనిపించడం విశేషం. దీంతో గతానికి భిన్నంగా విచ్చలవిడిగా కరపత్రాలు పంచడం, ప్రెస్‌మీట్లు పెట్టడం లాంటి కార్యక్రమాలు తగ్గించారు.

ప్రతి ఒక్కరికీ స్మార్ట్‌ ఫోన్‌ ఉండడం, ఇంటర్‌నెట్‌ అపరిమితంగా వినియోగిస్తున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా భారీ ఎత్తున ప్రచారం చేసేందుకు అభ్యర్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గం, మండలం, గ్రామం, వార్డుల వారీగా, కులాలు, సంఘాల వారీగా, యువజన సంఘాల పేరిట ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు.

సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని నిర్వహించేందుకు గాను ప్రత్యేకంగా జీతాలు ఇచ్చి మరీ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నిపుణులను ఉపయోగిస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ప్రచారం చేసినా ఆయా ప్రచారం అన్ని గ్రూపుల్లో వచ్చేవిధంగా ప్లాన్‌ చేసుకుని ముందుకు వెళుతున్నారు. ఫేస్‌బుక్‌ లైవ్‌లు, యూట్యూబ్‌ లైవ్‌లు సైతం పెట్టుకుని ప్రచారం సాగిస్తున్నారు.

పార్టీల మేనిఫెస్టోలోని పథకాల గురించి ప్రచారం చేస్తూనే స్థానిక అంశాలనూ ప్రచారాస్త్రాలుగా చేసుకుంటున్నారు. కరపత్రాలను పరిమిత సంఖ్యలో ముద్రించి, వాటిని పీడీఎఫ్‌ ఫైల్‌ తయారు చేయించి వాట్సాప్‌ గ్రూపుల ద్వారా భారీగా వైరల్‌ చేస్తున్నారు. వాట్సాప్‌ స్టేటస్‌లకు సైతం మరింత ప్రాధాన్యత పెరగడం గమనార్హం. వ్యక్తుల వాట్సాప్‌ స్టేటస్‌లను బట్టి సదరు వ్యక్తి ఆలోచనలను అంచనా వేసుకుంటూ అందుకు అనుగుణంగా అలాంటి వ్యక్తులను కన్విన్స్‌ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

'కొందరు యువకులు మాత్రం జిల్లాలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ వైఫల్యాలు, అపరిష్కృత సమస్యలు, పోటీ పరీక్షల విషయమై ప్రభుత్వం వైఫల్యాలు, పేపర్‌ లీక్‌లు తదితర అంశాలను వైరల్‌ చేస్తుండగా, స్థానిక సమస్యలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఇటీవల నందిపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకులు ధ్వంసమైన రోడ్ల గురించి ఎమ్మెల్యేను విమర్శిస్తూ సైటెరికల్‌గా చేసిన వీడియో వైరల్‌ అయింది. అదేవిధంగా ప్రభుత్వ పథకాల్లో అధికార పార్టీ నాయకులు కమీషన్లు తీసుకుంటున్నారని ఆర్మూర్‌కు చెందిన యువకులు చేసిన వీడియోలు బాగా వైరల్‌అయ్యాయి. ఇలా సోషల్‌ వార్‌ మరింత విస్తరిస్తోంది.'

Read latest Nizamabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

14-11-2023
Nov 14, 2023, 08:49 IST
సాక్షి, కరీంనగర్: 'అన్నా.. తమ్మీ.. నామినేషన్‌ వేశావు.. ఈ 15 రోజుల్లో ప్రచారం చేసి, నువ్వు గెలిచేది లేదు.. ఏ ఉద్దేశంతో నామినేషన్‌...
14-11-2023
Nov 14, 2023, 08:09 IST
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ) సోమవారం పూర్తయింది. ఈ...
14-11-2023
Nov 14, 2023, 08:04 IST
సాక్షి, కరీంనగర్‌: ఒకప్పుడు చాలా మంది నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి, సత్తా చాటేవారు. ఉమ్మడి కరీంనగర్‌...
14-11-2023
Nov 14, 2023, 07:55 IST
హైదరాబాద్: గత కొనేళ్లుగా వంటింట్లో మంట పుట్టిస్తున్న వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపుపై పార్టీల ఎన్నికల హామీలు ఊరట...
14-11-2023
Nov 14, 2023, 05:21 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని, వర్గీకరణను అమలు చేసే బాధ్యతను భుజస్కంధాలపై పెట్టుకుందని కేంద్రమంత్రి,...
14-11-2023
Nov 14, 2023, 05:13 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నామినేసన్ల పరిశీలన ప్రక్రియ సోమవారంతో ముగిసింది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల...
14-11-2023
Nov 14, 2023, 05:03 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలకు ‘మోదీ గ్యారంటీలు’పేరిట భరోసా కల్పించేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ వర్గాల...
14-11-2023
Nov 14, 2023, 05:01 IST
ఎన్నికల ప్రచారంలో వాడీవేడి కొటేషన్లు ‘‘నాకు ఏం మాట్లాడినా పంచ్‌ ఉండాలంతే.. పంచ్‌ లేకుంటే కుదరదంతే’ అని ’ఆర్య’ సినిమాలో సునీల్‌...
14-11-2023
Nov 14, 2023, 04:57 IST
సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 17న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోమారు రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 17న...
14-11-2023
Nov 14, 2023, 04:45 IST
ఎస్‌. వేణుగోపాలచారి: కామారెడ్డిలో ఏం జరుగుతుంది.. ఈ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టి అదే. తెలంగాణ తెచ్చిన నేతగా, ముచ్చటగా...
14-11-2023
Nov 14, 2023, 04:32 IST
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీలో భాగంగా అధికారులు సవ్యంగా లేని 207 నామినేషన్లను తిరస్కరించారు.15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్క్రూటినీ...
14-11-2023
Nov 14, 2023, 04:18 IST
బొల్లోజు రవి కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగింది. 19 స్థానాల్లో పోటీ చేస్తోంది. పొత్తు కోసం ఇన్నాళ్లు ఎదురుచూసినా ఫలితం లేకుండా...
14-11-2023
Nov 14, 2023, 04:02 IST
మేకల కళ్యాణ్‌ చక్రవర్తి  అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలోకి దిగడమంటే ఆషామాషీ కాదు. పోటీ చేసి గెలవాలంటే అంత ఈజీ...
14-11-2023
Nov 14, 2023, 02:03 IST
పార్టీ టికెట్‌ సాధన మొదలు, ఎన్నికల ప్రచారం, ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రలోభాల పర్వం వరకు మొత్తం రూ.కోట్ల డబ్బు...
14-11-2023
Nov 14, 2023, 01:31 IST
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ను బద్నాం చేసేందుకు బీజేపీతో కలిసి బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే...
14-11-2023
Nov 14, 2023, 01:17 IST
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ సాక్షి, వరంగల్‌/నర్సంపేట: ‘సాగుకు సంబంధించి బాగోగులు తెలియని కాంగ్రెస్‌ నేతలు వ్యవసాయానికి 3 గంటల...
14-11-2023
Nov 14, 2023, 01:15 IST
 సాక్షి, హైదరాబాద్‌: వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తుల ఉమకు బీ ఫారం ఇవ్వకుండా చివరి నిమిషంలో నిరాకరించడం ద్వారా...
13-11-2023
Nov 13, 2023, 16:23 IST
బీజేపీ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండదు. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి దొంగ దారిన.. 
13-11-2023
Nov 13, 2023, 16:16 IST
సాక్షి,ఖమ్మం : తన నామినేషన్‌ తిరస్కరించాలని ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ఫిర్యాదుపై మంత్రి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌ కుమార్‌ స్పందించారు....
13-11-2023
Nov 13, 2023, 14:55 IST
పీసీసీ అధ్యక్షుడు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రైతులకు మూడు గంటల కరెంట్‌చాలని



 

Read also in:
Back to Top