
పువ్వు ఇచ్చి.. పలకరించి..
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు డిపో మేనేజర్ పండరి శుక్రవారం గులాబీ పువ్వు ఇచ్చి... ఆప్యాయంగా పలకరించారు. ప్రయాణంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కీ చైన్లు అందజేశారు. కీ చైన్పై ఉన్న క్యూఆర్ కోడ్ సేవలను వివరించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆర్టీసీ అందిస్తున్న 10 రకాల సేవలు కనబడతాయని పేర్కొన్నారు. ఇందులో ఆర్టీసీ ప్రవేశపెడుతున్న పథకాలు, టికెట్ బుకింగ్స్ తదితర సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్, అసిస్టెంట్ ఇంజనీర్ నవీన్ కుమార్, స్టేషన్ మేనేజర్ ఏఆర్.రెడ్డి, కంట్రోలర్లు, కండక్టర్లు, డ్రైవర్లు పాల్గొన్నారు.