ఢిల్లీ ఘటన కారకులపై చర్యలు తీసుకోవాలి: ఎంపీ విజయసాయిరెడ్డి | YSRCP MP Vijaya Sai Reddy Comments On Delhi Students Issue | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఘటన కారకులపై చర్యలు తీసుకోవాలి: ఎంపీ విజయసాయిరెడ్డి

Jul 29 2024 1:52 PM | Updated on Jul 29 2024 3:53 PM

YSRCP MP Vijaya Sai Reddy Comments On Delhi Students Issue

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్‌ రాజేంద్రనగర్‌లో రావుస్‌ ఐఏఎస్‌ స్టడీ సెంటర్‌ బేస్‌మెంట్‌లోకి వరద నీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. విద్యార్థులు ఇలా జల సమాధి కావడం ఆందోళనకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘సివిల్స్ విద్యార్థులు ముగ్గురు జల సమాధి కావడం ఆందోళనకరం. వేలాదిమంది విద్యార్థులు ఎంతో ఖర్చుపెట్టి తమ కలలను నెరవేర్చుకునేందుకు ఢిల్లీకి వస్తున్నారు. వారికి సరైన వసతులు కల్పించాల్సిన బాధ్యత ఉంది. విద్యార్థుల ఆందోళనకు మద్దతిస్తున్నాం. ఈ ఘటనకు కారణమైన వారిపై  చర్యలు తీసుకోవాలి’ అంటూ కామెంట్స్‌ చేశారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement