మాండ్యా: తావరెకెరె గేట్ సమీపంలో బెంగళూరు-మంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న పికప్ ట్రక్కు.. ఓ కారును వెనుక నుంచి ఢీకొనడంతో 58 ఏళ్ల మహిళ మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. మృతురాలిని సుధా జైన్గా గుర్తించారు. గుజరాత్కు చెందిన ఆమె బెంగళూరులో నివసిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రావణబెళగొళ నుంచి బెంగళూరు వైపు ప్రయాణిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరో వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో పికప్ ట్రక్కు వేగంగా వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా కారును ఢీ కొట్టడంతో సుధా జైన్ మృతి చెందింది. జాతీయ రహదారిపై అదే సమయంలో వెళ్తున్న మరో వాహనం డ్యాష్బోర్డ్ కెమెరాలో ఈ ప్రమాదం నమోదైంది.
గాయపడ్డవారిని చికిత్స కోసం బీజీ నగర్లోని ఆదిచుంచనగిరి ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ప్రమాదం నుంచి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదం అనంతరం పికప్ ట్రక్కు డ్రైవర్ అక్కడే వాహనాన్ని వదిలి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. బెల్లూరు పోలీసులు రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
One Dead,Four Injured in Mandya Car Collision
Mandya, Karnataka
A woman was killed and four others injured in a road accident near Bellur in #Mandya district on Sunday afternoon.
According to Mandya SP Dr. Shobha Rani, a Swift car carrying four occupants ,Sudha Jain, her… pic.twitter.com/alDZTDT521— Yasir Mushtaq (@path2shah) September 7, 2026


