మెయిన్స్కు అర్హుల జాబితా ప్రకటించిన కమిషన్
దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక పోటీ పరీక్షల్లో ఒకటైన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష-2026 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) సోమవారం రాత్రి ప్రకటించింది. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన 13,343 అభ్యర్థుల రోల్ నంబర్ల జాబితాను అధికారిక వెబ్సైట్లో ఉంచింది.
ఈ ఏడాది మే 24న దేశవ్యాప్తంగా 83 నగరాల్లోని 2,072 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. మొత్తం 1,016 సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షకు 8,19,372 మంది అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తదుపరి దశ అయిన మెయిన్స్కు అర్హత సాధించారు. ప్రిలిమ్స్లో సాధించిన మార్కులు తుది ర్యాంకుల నిర్ణయంలో పరిగణనలోకి తీసుకోరని యూపీఎస్సీ మరోసారి స్పష్టం చేసింది.


