Sakshi News home page

అదీ బాబు గ్యాంగ్ అంటే.. ఆ విధంగా తుస్సుమన్నారు

Published Wed, Aug 2 2023 4:29 PM

TDP MPs Speechless With The Union Minister Kapil Patil answer - Sakshi

సాక్షి, ఢిల్లీ:  ఇటీవల ఏపీ అప్పులపై పార్లమెంట్‌ వేదికగా ప్రశ్నించి భంగపడ్డ టీడీపీ.. మరోసారి ఏపీ విషయంలో ఏదో చేయబోయి అడ్డంగా బుక్కైంది.  ఏపీలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి  కపిల్ మొరేశ్వర్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ ఎంపీలు.. . అయితే కేంద్ర మంత్రి ఉపాధి హామీ పథకంలో అవతవకలకు ఎటువంటి ఆస్కారం ఉండనే ఉండదంటూ కుండబద్ధలు కొట్టారు. అంతా ఆన్‌లైన్‌ వేదికగా చెల్లింపులు జరుగుతున్నప్పుడు అవతవకలకు ఆస్కారం​ ఎలా ఉంటుందని టీడీపీ ఎంపీలను నిలదీశారు కేంద్రమంత్రి.  దీంతో టీడీపీ ఎంపీలు తిరిగి సమాధానం చెప్పలేక నోరెళ్ల బెట్టారు.

అన్ని పనులకు జియో ట్యాగ్గింగ్, పనుల, కూలీల ఫోటోలు ఉంటాయని అధికారులు కూడా చెప్పడంతో టీడీపీ ఎంపీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఈ క్రమంలోనే ఒకపక్షం వాదనలు విని చర్యలు తీసుకోలేమని  మంత్రి తేల్చిచెప్పేశారు. అన్ని అంశాలను అధ్యయనం చేసి తదుపరి చర్యలు మంత్రి స్పష్టం చేశారు. దాంతో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన టీడీపీ ఎంపీలు , ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు వైబి రాజేంద్రప్రసాద్‌లకు ఏమి చేయలో పాలుపోక అలానే తిరుగుముఖం పట్టారు.




 

చదవండి: ఏపీ అప్పులపై పార్లమెంట్‌ సాక్షిగా బయటికొచ్చిన వాస్తవాలు

Advertisement

తప్పక చదవండి

Advertisement