యూపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ‘ఆర్‌ఎస్‌ఎస్‌పీ’ | Swami Prsad Maurya Formed a New Party | Sakshi
Sakshi News home page

UP Politics: యూపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ‘ఆర్‌ఎస్‌ఎస్‌పీ’

Feb 19 2024 1:00 PM | Updated on Feb 19 2024 1:13 PM

Swami Prsad Maurya Formed a New Party - Sakshi

సమాజ్‌వాదీ పార్టీలో నిర్లక్ష్యానికి గురయ్యానని ఆరోపిస్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య కొత్త పార్టీని స్థాపించనున్నారు. ఇందుకోసం ఆయన కొత్త పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. 

ఫిబ్రవరి 22న ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో జరిగే ర్యాలీలో ఆయన ప్రసంగించనున్నారు.  స్వామి ప్రసాద్ మౌర్య కొత్త పార్టీ పేరు రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీ (ఆర్‌ఎస్‌ఎస్‌పీ). పార్టీ జెండా నీలం, ఎరుపు, ఆకుపచ్చ రంగులతో కూడి ఉంటుంది. అయితే ప్రసాద్‌ మౌర్యను బుజ్జగించి, ఆయన ప్రయత్నాలను విరమింపజేసేందుకు ఎస్పీ సీనియర్ నేత రామ్ గోవింద్ చౌదరి ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం.
ఇది కూడా చదవండి: అఖిలేష్‌పై అలిగి.. ప్రసాద్‌ మౌర్య కొత్త పార్టీ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement