సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం సమావేశం అవుతోంది. సచివాలయంలో ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్యాదవ్ తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాతో పాటు రేషనలైజేషన్ తర్వాత పోలింగ్ స్టేషన్ల వివరాలను రాజకీయపార్టీలకు అందించనున్నారు. అలాగే ఫిర్యాదుల పరిష్కారంపై అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.


