సత్వర విచారణ నిందితుడి ప్రాథమిక హక్కు: సుప్రీం | Speedy trial fundamental right says Supreme Court | Sakshi
Sakshi News home page

సత్వర విచారణ నిందితుడి ప్రాథమిక హక్కు: సుప్రీం

Dec 7 2024 5:47 AM | Updated on Dec 7 2024 5:47 AM

Speedy trial fundamental right says Supreme Court

న్యూఢిల్లీ: కేసుల్లో వేగంగా విచారణ జరగడం, కోర్టు నుంచి సాధ్యమైనంత త్వరగా తీర్పు పొందడం నిందితుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అండర్‌ ట్రయల్స్‌ను నిరవధికంగా నిర్బంధంలో ఉంచడం సరికాదని జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ల ధర్మాసనం పేర్కొంది.

 బిహార్‌లో నాలుగేళ్లకు పైగా కస్టడీలో ఉన్న వ్యక్తికి శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. విచారణ ఇప్పట్లో పూర్తయే అవకాశం కనిపించడం లేదు గనుక బెయిలిస్తున్నట్టు వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement