స్పీకర్‌ అలా మాట్లాడాల్సింది కాదు: శరద్‌పవార్‌ | Sharad Pawar Responds To Speaker Om Birla Comments On Emergency | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ ఓం బిర్లా అలా మాట్లాడాల్సింది కాదు: శరద్‌పవార్‌

Jun 29 2024 3:34 PM | Updated on Jun 29 2024 3:45 PM

Sharad Pawar Responds To Speaker Om Birla Comments On Emergency

ముంబై: ఎమర్జెన్సీ అంశానికి సంబంధించి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా  చేసిన వ్యాఖ్యలపై నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎస్‌సీపీ) చీఫ్‌ శరద్‌ పవార్‌ స్పందించారు. స్పీకర్‌ స్థాయికి తగినట్లు  సభలో మాట్లాడలేదని విమర్శించారు. శనివారం(జూన్‌29) మీడియా సమావేశంలో పవార్‌ ఈ మేరకు వ్యాఖ్యానించారు. 

లోక్‌సభ స్పీకర్‌ పదవిలో ఉన్న ఓం బిర్లా సందర్భం లేకుండా ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించారన్నారు. ఇది ఆయన స్థాయికి ఏమాత్రం తగదని విమర్శించారు. ఆ చీకటి అధ్యాయం ముగిసి 50 ఏళ్లు కావొస్తోందని, ప్రస్తుతం ఈ అంశాన్ని తెర మీదకు ఎందుకు తీసుకొస్తున్నారని పవార్‌ ప్రశ్నించారు.

లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ ఎన్నికను పవార్‌ స్వాగతించారు. ప్రతిపక్ష నేత బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలరంటూ విశ్వాసం వ్యక్తంచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement