
పుణె: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్పదవార్ తన వయసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుణెలోని హవేలి తాలూకాలో జరిగిన ఎడ్లబండ్ల పరుగు పందెం పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
‘చాలా మందితో నా సమస్య ఏంటంటే వారంతా నా వయసు గురించి మాట్లాడుతున్నారు. నా వయసు ఇప్పుడు 83 ఏళ్లు. నేను ఇంకా వృద్ధున్ని కాలేదు. నాలో ఇంకా చాలా శక్తి ఉంది. ఇప్పటికీ కొంత మందిని నేను సరిచేయగలను’అని పవార్ వ్యాఖ్యానించారు.
శరద్పవార్ వయసు పైబడిందని ఆయన రిటైర్ అవ్వాలని పవార్ మేనల్లుడు, ప్రస్తుత మహారాషష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చాలాసార్లు మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ఆయన మేనల్లుడికి మాటలకు కౌంటరేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. లోక్సభ సాధారణ ఎన్నికలు ముగిసిన వెంటనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.