నీట్‌ వివాదం.. ధర్మేంద్ర ప్రదాన్‌ కీలక కామెంట్స్‌ | Minister Darmendra Pradan Comments On Neet Paper Leak | Sakshi
Sakshi News home page

నీట్‌ వివాదం.. స్పందించిన కేంద్ర మంత్రి ప్రదాన్‌

Jun 16 2024 7:48 PM | Updated on Jun 16 2024 7:54 PM

Minister Darmendra Pradan Comments On Neet Paper Leak

భువనేశ్వర్‌: ‘నీట్‌’పేపర్‌ లీక్‌ వ్యవహారంలో ఒకవేళ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అధికారులది తప్పని తేలితే వదిలేది లేదని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ స్పష్టం చేశారు. ఆదివారం(జూన్‌16) ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘పేపర్‌లీక్‌కు సంబంధించి రెండు చోట్ల అక్రమాలు వెలుగుచూశాయి. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని పేరెంట్స్‌, తల్లిదండ్రులకు హామీ ఇస్తున్నా. ఇందులో ఎంత పెద్దస్థాయి అధికారులున్నప్పటికీ వదిలేది లేదు. 

ఎన్‌టీఏలో చాలా మార్పులు చేయాల్సి ఉంది. బిహార్‌ ఆర్థిక నేరాల విభాగం తొమ్మిది మంది నీట్‌ అభ్యర్థులకు పేపర్‌లీక్‌ కేసులో నోటీసులిచ్చింది. వారిని విచారణకోసం పిలిచాం’అని ప్రదాన్‌ తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement