సాక్షి, అమరావతి: దేశంలో మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్ పీజీ – 2026 పరీక్షను ఆగస్టు 30న నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్లైన్లో బుధవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పరీక్ష కేంద్రాల సమాచారం ఆగస్టు 11న ప్రకటిస్తారు. సెప్టెంబర్ 30న ఫలితాలు వెల్లడించనున్నారు.


