‘ఆధారాల్లేకుండా అదానీపై కాంగ్రెస్‌ ఆరోపణలు’ | M Jethmalani Slams Congress In Adani Case | Sakshi
Sakshi News home page

‘ఆధారాల్లేకుండా అదానీపై కాంగ్రెస్‌ ఆరోపణలు’

Nov 27 2024 5:04 PM | Updated on Nov 27 2024 5:47 PM

M Jethmalani Slams Congress In Adani Case

న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంతో.. కాంగ్రెస్‌ కావాలనే రాజకీయం చేస్తోందని ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు మహేష్‌ జెఠ్మలానీ  అంటున్నారు.అదానీపై అమెరికాలో నమోదైంది అభియోగాలు మాత్రమే.. అవి రుజువు కాలేదని అన్నారాయన.

ఛార్జ్‌షీట్‌లో ఎలాంటి ఆధారాలు లేవు. అయినా కావాలనే కాంగ్రెస్‌ రాజకీయం చేస్తోంది.అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ పనితీరు గురించి ట్రంప్‌ ఎప్పుడో చెప్పారు. యూఎస్‌ న్యాయశాఖ.. బైడెన్‌ కనుసన్నల్లో పని చేసే విభాగం. అంతర్జాతీయంగా వ్యాపారం నిర్వహిస్తున్న భారత కంపెనీల పై అమెరికాలో దాఖలైన అభియోగాలను గుడ్డిగా నమ్ముతుంది కాంగ్రెస్ పార్టీ. కానీ, అభియోగ పత్రంలో లంచాలు ఇచ్చినట్లు ఆధారాల్లేవు.

సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కేందుకు భారత అధికారులకు లంచాలకు కుట్ర చేశారనే ఆరోపణలకు  ఆధారాలు ఎక్కడున్నాయి?. ఆరోపణలు చేసే ముందు కాంగ్రెస్‌ ఆధారాలు చూపాలి. దీన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకోవాలనుకుంటోంది. మహారాష్ట్రలో ఓటమి తర్వాత  ఈ అంశాన్ని డైవర్షన్ కోసం ఉపయోగించుకుంటున్నారు.  కాంగ్రెస్ పార్టీకి అదానీ, మణిపూర్‌ మినహా  మిగిలిన అంశాలేవీ లేవా?  అని  ప్రశ్నించారాయన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement