Tamilnadu: తల్లి వద్దు.. ప్రియుడే కావాలి..

Love Affair: Lovers Approaches Police For Protection Against Parents In Tamilnadu - Sakshi

సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): తల్లి మాటను కాదని ప్రియుడే కావాలని నిర్ణయించుకుంది ఓ డిగ్రీ విద్యార్థిని. కన్యాకుమారి జిల్లా మార్తాండం సమీపంలోని కరవిలగం ప్రాంతానికి చెందిన రామచంద్రన్‌ కుమారుడు సజిన్‌ (25), కరంగల్‌ ప్రాంతానికి చెందిన డిగ్రీ సెకండియర్‌ చదువుతున్న రాజేంద్రన్‌ కుమార్తె అబిషా (21) ప్రేమించుకున్నారు. ఇద్దరు ఇంట్లో నుంచి లేచిపోయి ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు.

రక్షణ కల్పించాలని మార్తాండం పోలీసులను ఆశ్రయించారు. ఇన్‌స్పెక్టర్‌ సెంథిల్‌వేల్‌ వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. చదువు పూర్తయిన తరువాత ప్రియుడి ఇంటికి వెళ్లాలని తల్లి, పోలీసులు అమ్మాయికి సలహా ఇచ్చారు. ఆ అమ్మాయి తన మెడలో ఉన్న నగలను తీసి తల్లికి ఇచ్చి ప్రియుడు వెంట వెళ్లేందుకు సమ్మతించింది.  

చదవండి: ముందస్తు ‘కుట్ర’తోనే రైతులను తొక్కించారు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top