పార్లమెంట్‌ ప్రవేశద్వారాల వద్ద ధర్నాలపై నిషేధం | Lok Sabha Speaker Om Birla bans protests at Parliament gates | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ ప్రవేశద్వారాల వద్ద ధర్నాలపై నిషేధం

Dec 20 2024 5:25 AM | Updated on Dec 20 2024 5:25 AM

Lok Sabha Speaker Om Birla bans protests at Parliament gates

ప్రకటించిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా 

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ మకర ద్వారం వద్ద గురువారం అధికార, విపక్ష పారీ్టల సభ్యుల మధ్య వాగ్వాదం, తోపులాట నేపథ్యంలో ఇలాంటివి పునరావృతంకాకుండా నివారించేందుకు లోక్‌సభ స్పీకర్‌ ఇకపై పార్లమెంట్‌ ప్రవేశద్వారాల వద్ద ధర్నాలపై నిషేధం విధించారు.

 ఎంపీలు, రాజకీయ నేతలు, విడివిడిగా, బృందంగా ఇకపై ఏవైపు గేట్‌ వద్ద కూడా ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేపట్టకూడదని స్పీకర్‌ ఓం బిర్లా గురువారం కఠిన నియమాలను సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement