Sakshi News home page

Lok Sabha Elections 2024: మళ్లీ బీజేపీలోకి గాలి జనార్దనరెడ్డి

Published Mon, Mar 25 2024 5:41 AM

Lok sabha elections 2024: Gali Janardhan Reddy to merge his party into BJP - Sakshi

సాక్షి, బెంగళూరు: మైనింగ్‌ వ్యాపారి, కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష(కేఆర్‌పీపీ) పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి మళ్లీ కాషాయ పారీ్టలోకి చేరబోతున్నారు. కేఆర్‌పీపీని బీజేపీలో విలీనం చేయనున్నారు. ఈ నెల 25వ తేదీన ఉదయం 10 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర సమక్షంలో ఆ పారీ్టలో చేరనున్నట్లు ఆదివారం మీడియాకు తెలిపారు. 

నరేంద్ర మోదీని మూడో సారి ప్రధానమంత్రిగా చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. బళ్లారిలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థి బి.శ్రీరాములుకు మద్దతు తెలిపారు. బీఎస్‌ యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జనార్దనరెడ్డి, ఆ తర్వాత మైనింగ్‌ కుంభకోణం కేసులో జైలు పాలయ్యారు. కేఆర్‌పీపీని సొంతంగా ఏర్పాటు చేసి, 2023 ఎన్నికల్లో పోటీ చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement