ప్రపంచ విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు, స్పెషల్‌ జెర్సీ | Indian womens cricket team presents President Murmu with signed jersey | Sakshi
Sakshi News home page

ప్రపంచ విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు, స్పెషల్‌ జెర్సీ

Nov 6 2025 4:19 PM | Updated on Nov 6 2025 5:08 PM

Indian womens cricket team presents President Murmu with signed jersey

న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ కప్ గెలిచి, చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టును  దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అభినందించారు.  ప్రపంచ కప్‌ గెలిసి  చరిత్ర సృష్టించారని, యువతరానికి ఆదర్శంగా నిలిచారంటూ  జట్టు సభ్యులను ప్రశంసించారు.

ఇదీ చదవండి: స్కిన్‌ కేర్‌పై క్రికెటర్‌ ప్రశ్న, ప్రధాని మోదీ సమాధానం ఏంటో తెలుసా?

గురువారం రాష్ట్రపతి భవన్‌లో మహిళా క్రికెట్‌ ప్రపంచ కప్ విజేతలను ద్రౌపది ముర్ము కలిశారు. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ క్రీడాకారులందరూ సంతకం చేసిన జట్టు జెర్సీని ఆమెకు అందజేశారు. ప్రపంచ కప్ ట్రోఫీని కూడా రాష్ట్రపతికి అందజేశారు. ఆ బృందం బుధవారం ముందుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసింది.

ఇదీ చదవండి: తండ్రి త్యాగం, కొడుకు సర్‌ప్రైజ్‌ : నెటిజనుల భావోద్వేగం

కాగా ఆదివారం నవీ ముంబైలో జరిగిన 50 ఓవర్ల ప్రపంచ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి భారత్ మహిళా క్రికెట్‌లో తొలి ప్రపంచ టైటిల్‌ను కైవసం చేసుకున్న సంగతి  తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement