ప్రపంచ విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు, స్పెషల్‌ జెర్సీ | Indian womens cricket team presents President Murmu with signed jersey | Sakshi
Sakshi News home page

ప్రపంచ విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు, స్పెషల్‌ జెర్సీ

Nov 6 2025 4:19 PM | Updated on Nov 6 2025 5:08 PM

Indian womens cricket team presents President Murmu with signed jersey

న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ కప్ గెలిచి, చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టును  దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అభినందించారు.  ప్రపంచ కప్‌ గెలిసి  చరిత్ర సృష్టించారని, యువతరానికి ఆదర్శంగా నిలిచారంటూ  జట్టు సభ్యులను ప్రశంసించారు.

ఇదీ చదవండి: స్కిన్‌ కేర్‌పై క్రికెటర్‌ ప్రశ్న, ప్రధాని మోదీ సమాధానం ఏంటో తెలుసా?

గురువారం రాష్ట్రపతి భవన్‌లో మహిళా క్రికెట్‌ ప్రపంచ కప్ విజేతలను ద్రౌపది ముర్ము కలిశారు. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ క్రీడాకారులందరూ సంతకం చేసిన జట్టు జెర్సీని ఆమెకు అందజేశారు. ప్రపంచ కప్ ట్రోఫీని కూడా రాష్ట్రపతికి అందజేశారు. ఆ బృందం బుధవారం ముందుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసింది.

ఇదీ చదవండి: తండ్రి త్యాగం, కొడుకు సర్‌ప్రైజ్‌ : నెటిజనుల భావోద్వేగం

కాగా ఆదివారం నవీ ముంబైలో జరిగిన 50 ఓవర్ల ప్రపంచ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి భారత్ మహిళా క్రికెట్‌లో తొలి ప్రపంచ టైటిల్‌ను కైవసం చేసుకున్న సంగతి  తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement