ఆపరేషన్‌ సిందూర్‌.. మసూద్‌ అజర్‌ ఫ్యామిలీ ఖతం | Indian Strikes In Pakistan Kill Jaish Chief Masood Azhar 10 Family Members And 4 Close Aides | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ సిందూర్‌.. మసూద్‌ అజర్‌ ఫ్యామిలీ ఖతం

May 7 2025 3:13 PM | Updated on May 7 2025 5:28 PM

Indian Strikes In Pakistan Kill Jaish Chief Masood Azhar 10 Family Members And 4 Close Aides

ఢిల్లీ: ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ దాయాది పాకిస్థాన్‌కు భయం పుట్టిస్తోంది. ప్రధానంగా జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని కూల్చివేసింది. విజయవంతంగా జరిపిన ఈ ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌కు చావు దెబ్బ తగిలినట్లు సమాచారం.

జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందులో 10 మంది మసూద్‌ కుటుంబసభ్యులేనని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బవహల్పూర్‌ లోని జైష్-ఎ-మహమ్మద్‌, మురిద్కే కేంద్రంగా ఉన్న లష్కర్-ఎ-తొయిబా క్యాంపులపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా సమాచారం.

ముఖ్యంగా బవహల్పూర్‌లోని జైష్-ఎ-మహమ్మద్‌ శిబిరాలు, సుభాన్ అల్లా కాంప్లెక్స్‌‌పై జరిపిన ఎయిర్ స్ట్రైక్‌లో ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మందితో పాటు అనుచరులు మరణించినట్లు తెలుస్తోంది. మసూద్ అజార్ అక్క, బావ, మేనల్లుడు, అతడి భార్య కూడా ఉన్నట్లు సమాచారం.

	ఆపరేషన్ సింధూర్ లో మసూద్ అజర్ ఫ్యామిలీ ఖతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement