ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా | Hearing On Kavitha Bail Petition Adjourned | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా

May 25 2024 3:45 AM | Updated on May 25 2024 3:45 AM

Hearing On Kavitha Bail Petition Adjourned

27న విచారిస్తామన్న ఢిల్లీ హైకోర్టు  

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ స్కామ్‌లో బెయిల్‌ కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరుగా కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లను శుక్రవారం జస్టిస్‌ స్వర్ణకాంతశర్మ విచారించారు. కవిత తరఫు సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌చౌదరి వాదనలు వినిపిస్తూ కవితను అరెస్టు చేసే క్రమంలో పలు ఉల్లంఘనలు జరిగాయని తెలిపారు. ఈ కేసులో నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, చట్టాలు అనుసరించి బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు.

కేసు నమోదు చేసిన తొలినాళ్లలో కవిత పేరు లేదని అప్రూవర్లుగా మారిన వారి స్టేట్‌మెంట్ల ఆధారంగా ఆమెను అరెస్టు చేశారన్నారు. అభిõÙక్‌ బోయినపల్లి, విజయ్‌నాయర్‌లకు బెయిలు వచి్చన విషయాన్ని విక్రమ్‌చౌదరి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈడీ కేసులో కౌంటర్‌ దాఖలు చేసినట్టు న్యాయవాది జొహెబ్‌ హొస్సేన్‌ తెలిపారు. తమ కౌంటర్‌ ఈ నెల 27లోగా దాఖలు చేస్తామని సీబీఐ తరఫు న్యాయవాది పేర్కొనగా, ఆదివారం రాత్రి పది గంటలలోపు దాఖలు చేయాలని న్యాయమూర్తి తెలిపారు. వీలైనంత వరకూ శనివారమే దాఖలు చేయడానికి యత్నిస్తామని సీబీఐ తరఫు న్యాయ వాది కోర్టుకు తెలిపారు, అనంతరం, సోమవారం కవిత తరఫు వాదనలు పూర్తి చేయాలని, మంగళవారం దర్యాప్తు సంస్థల వాదనలు వింటామని జస్టిస్‌ స్వర్ణకాంతశర్మ విచారణ వాయిదా వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement