ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కార్యదర్శిగా గణేశ్వరన్ పొట్టి | Ganesaran appointed as Secretary of Travancore Devaswom Board | Sakshi
Sakshi News home page

ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కార్యదర్శిగా గణేశ్వరన్ పొట్టి

Nov 9 2025 1:17 PM | Updated on Nov 9 2025 2:04 PM

Ganesaran appointed as Secretary of Travancore Devaswom Board

తిరువనంతపురం:  దక్షిణ భారతదేశంలోని సుమారు 1200 దేవాలయాల నిర్వహణను చూసుకునే స్వయంప్రతిపత్తి సంస్థ ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కార్యదర్శిగా పి ఎన్  గణేశ్వరన్ పొట్టి నియమితులయ్యారు. ఆయన  స్వస్థలం కుట్టనాడ్‌లోని అలప్పుజలోని కొడుప్పున్న. గణేశ్వరన్ పొట్టి గతంలో దేవస్వం డిప్యూటీ కమిషనర్ (ఇన్‌స్పెక్షన్), దేవస్వం డిప్యూటీ కమిషనర్ (హైకోర్టు ఆడిట్), అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అలువా దేవస్వం, దేవస్వం విజిలెన్స్ ఆఫీసర్ పదవులను నిర్వహించారు. గణేశ్వరన్ పొట్టి  వృక్షశాస్త్రంలో పట్టభద్రులు.

శబరిమల బంగారం దోపిడీకి సంబంధించిన వివాదాల నడుమ ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డులో కీలకమైన నిర్ణయాలు, నియామకాలు జరిగాయి. బోర్డు కార్యదర్శిగా తాజాగా పి ఎన్ గణేశ్వరన్ పొట్టి నియమితులయ్యారు.  అలాగే దేవస్వం బోర్డు అధ్యక్షుడు పి ఎస్ ప్రశాంత్ పదవీకాలాన్ని మరో సంవత్సరం పొడిగించాలని సీపీఎం సెక్రటేరియట్ సమావేశం నిర్ణయించింది. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement