Manipur: మణిపూర్‌లో మళ్లీ కాల్పులు | Fresh Firing In Manipur Bishnupur 4 Men Missing | Sakshi
Sakshi News home page

Manipur: మణిపూర్‌లో మళ్లీ కాల్పులు

Jan 11 2024 7:31 AM | Updated on Jan 11 2024 10:18 AM

Fresh Firing In Manipur Bishnupur 4 Men Missing - Sakshi

అల్లం కోయడానికి వెళ్లిన నలుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు..

ఇంఫాల్: మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో మళ్లీ కాల్పులు జరిగాయి. కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలో అల్లం కోయడానికి వెళ్లిన నలుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. బిష్ణుపూర్ జిల్లాలోని కుంబి, తౌబల్ జిల్లాలోని వాంగూ మధ్య కాల్పుల ఘటన జరిగింది. 

గల్లంతైన నలుగురిని ఓయినమ్ రోమెన్ మైతేయి (45), అహంతేమ్ దారా మైతేయి (56), తౌడమ్ ఇబోమ్చా మైతేయి (53), తౌడం ఆనంద్ మైతేయి (27)గా గుర్తించారు. ఘటన తర్వాత కుంబి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. కాల్పులు జరగడానికి ముందు ఆరు రౌండ్ల మోర్టార్ కాల్పులు జరిగాయని స్థానిక నివేదికలు తెలిపాయి.

అంతకుముందు జనవరి 1న, తౌబల్స్ లిలాంగ్ ప్రాంతంలో గుర్తుతెలియని సాయుధ దుండగులు, స్థానికుల మధ్య ఘర్షణలు చెలరేగింది. ఈ ఘర్షణల్లో నలుగురు మరణించారు. మరుసటి రోజే గస్తీలో ఉన్న సాయుధ బలగాలపై దుండగులు కాల్పులు జరిపారు. మణిపూర్‌లో గత ఏడాది మేలో మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగాయి. అ‍ప్పటి నుంచి అడపాదడపా హింసాత్మక సంఘటనలు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 180 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి:  సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement