బొమ్మనహళ్ళి: బెంగళూరు నగర జిల్లాలోని ఆనేకల్ తాలూకాలోని హుసూ్కరు వద్ద మాజీ ఎమ్మెల్సీని కొందరు దుండగులు అపహరించి, డబ్బు డిమాండ్ చేశారు. వివరాలు.. మాజీ ఎమ్మెల్సీ దయానంద్ రెడ్డి సోమవారం అర్ధరాత్రి గోల్డ్ కాయిన్ క్లబ్ నుంచి కారులో బయల్దేరారు. ఈ సమయంలో, బైక్పై వచ్చిన దుండగులు కారును అడ్డగించి, మీకు బహుమతి వచ్చిందని చెబుతూ ఆయనకు ఒక పెట్టెను చూపించారు. డోర్ లాక్ తెరుస్తుండగా, ఒక వ్యక్తి కారులోకి ప్రవేశించి, తుపాకీ గురిపెట్టి, తాను చెప్పిన చోటుకు వెళ్లాలని చెప్పాడు. ఆ తర్వాత, ఎర్ర కారులో మరో ఇద్దరు వ్యక్తులు వెంబడించారు.
అత్తిబెలె కేహెచ్బీ బరంగాయ్ సమీపానికి తీసుకెళ్లి, నిన్ను హత్య చేయడానికి రూ.10 కోట్ల ఆఫర్ వచ్చిందని చెప్పారు. దీంతో భయపడిన దయానంద్ రెడ్డి ఆ డబ్బును తానే ఇస్తానని, తనను చంపవద్దని వేడుకున్నారు. చివరకు రూ.2 కోట్లు ఇవ్వడానికి కుదిరింది. అయితే ఇప్పుడు డబ్బులు లేవని, సోమవారం బ్యాంకు నుంచి తీసుకుని ఇస్తానని ఆయన చెప్పడంతో వదిలిపెట్టారు. వెంటనే ఆయన స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలింపు సాగిస్తున్నారు.


