తమిళనాడు: వేలూరు సత్వచ్చారిలో సుమారు 35 సంవత్సరాల వయస్సు గల యువతి జిమ్ శిక్షణ కేంద్రం నడుపుతున్నారు. ఇక్కడ సత్వచ్చారి సమీపంలోని అనైథెరిస్సా వీధికి చెందిన ఎబ్సిబా అనే మహిళ శిక్షణకు చేరింది. ఈమె వేలూరులోని ప్రవేటు ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తుంది.
ఆ సమయంలో జిమ్ యజమాని వద్ద ఎబ్సిబా బాగా పరిచయమయ్యారు. ఈ నేపద్యంలో ఎబ్సిబా తన కుమారుడికి జన్మదినోత్సవ వేడుకలు ఉన్నాయని మీరు తప్పకుండా తమ ఇంటికి రావాలని జిమ్ యజమానిని పిలిచింది. దీంతో గత సంవత్సరం జూన్ 20వ తేదిని జిమ్ యజమాని ఎబ్సిబా ఇంటికి వెల్లింది. ఆ సమయంలో ఎబ్సిబా ఆమె భర్త మణివణ్ణన్ కలిసి జిమ్ యజమానికి శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చారు.
వీటిని తాగిన జిమ్ యజమాని స్పృహ తప్పి పడి పోయారు. ఆ సమయంలో మణివణ్ణన్ ఆ యువతిని అత్యాచారం చేసినట్లు తెలుస్తుంది. వీటిని ఎబ్సిబా వీడియో తీసింది. అనంతరం యువతిని నగ్నంగా చేసి వీడియో, ఫొటోలు తీశారు. వీటిని సోషియల్ మీడియాలో వదిలి పెడుతామని బెదిరించి జిమ్ యజమాని వద్ద గత ఆరు నెలలుగా రూ. 4 లక్షల 50 వేలు ఇంటి వస్తువులు, బంగారం తదితర వాటిని కాజేసినట్లు తెలుస్తుంది. దీంతో జిమ్ యజమాని వీటిపై వేలూరులోని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఎబ్సిబా, ఆమె భర్త మణివణ్ణన్ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.


