మహాగఠ్బంధన్కు మరోసారి నిరాశే
ప్రశాంత్ కిశోర్ పార్టీకి ఘోర పరాభవం
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడి
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు మంగళవారం ముగిశాయి. రెండు విడతల్లో జరిగిన పోలింగ్లో రికార్డుస్థాయిలో ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. బిహార్ అధికార పీఠం మరోసారి జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే)కే దక్కబోతున్నట్లు మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తేలి్చచెప్పాయి. విపక్ష మహాగఠ్బంధన్కు నిరాశ తప్పదని పేర్కొన్నాయి.

ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీకి ఘోర పరాజయం ఎదురుకాబోతున్నట్లు స్పష్టంచేశాయి. యాక్సిస్ మై ఇండియా, టుడేస్ చాణక్య ఎగ్జిట్ ఫోల్స్ ఫలితాలు బుధవారం వెల్లడికానున్నాయి. బిహార్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 243. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది సభ్యుల మద్దతు అవసరం. మెజార్టీ మార్కును ఎన్డీయే సులభంగా చేరుకుంటుందని మంగళవారం ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాలనకు ఈ ఎన్నికలు రిఫరెండమేనన్న వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే.


