
సాక్షి,చెన్నై: ఎన్నోర్ థర్మల్ పవర్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తొమ్మిదిమంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు.
చెన్నై ఎన్నోర్లో అనల మిన్ స్టేషన్ విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో వందలాది మంది ఉత్తర భారత కార్మికులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నిర్మాణ పనుల్లో భాగంగా నిర్మించిన శ్లాబు కూలింది.
ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారిని చెన్నై రాయపురం స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషాదకర ఘటన ఎన్నోర్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.
#Breaking:- चेन्नई में बड़ा हादसा, थर्मल पावर प्लांट में गिरी मचान, 9 मजदूरों की मौत#Chennai #chennaitharmalplant # pic.twitter.com/5HvEYf8bfD
— Ritesh Pathak (@VoiceOFRites_7) September 30, 2025
ప్రమాదంపై తమిళనాడు విద్యుత్ బోర్డు (TNEB) చైర్మన్ జె.రాధాకృష్ణన్ మాట్లాడారు.‘ఈ ప్లాంట్లో మొత్తం 3,700 మంది కార్మికులు పనిచేస్తున్నారు. భద్రతా అధికారులు, అధికారులు సమీపంలోని మూడు ప్లాంట్ల బృందాలతో పాటు, తనిఖీలు నిర్వహిస్తున్నారు.మరిన్ని సమస్యలు తలెత్తకుండా చూసుకుంటున్నారు’అని అన్నారు.
Tamil Nadu: Chairman of the Tamil Nadu Electricity Board (TNEB) J. Radhakrishnan says, "...One person has been injured and is currently stable. The plant employs roughly 3,700 workers overall. Safety officers and officials are on site, along with teams from three nearby plants,… pic.twitter.com/3ma6Y4OEOR
— IANS (@ians_india) September 30, 2025