కూలిన పైకప్పు 8 మంది మృతి.. శిథిలాల కింద 45 మంది | Eight killed after warehouse roof collapses in Kolkata | Sakshi
Sakshi News home page

కూలిన పైకప్పు 8 మంది మృతి.. శిథిలాల కింద 45 మంది

Jun 24 2026 2:53 PM | Updated on Jun 24 2026 3:06 PM

 Eight killed after warehouse roof collapses in Kolkata

పశ్చిమబెంగాల్: కోల్‌కతాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ గోడౌన్‌ పైకప్పు  కుప్పకూలి ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారు. శిథిలాల కింద  మరో 45 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సహాయకు సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే శిథిలాల కింద పెద్దఎత్తున కార్మికులు చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement