అభిషేక్‌ బెనర్జీకి షాకిచ్చిన ఈడీ | ED summons Abhishek Banerjee and his wife in coal scam case | Sakshi
Sakshi News home page

Coal scam: అభిషేక్‌, భార్య రుజీరాకు ఈడీ సమన్లు

Aug 28 2021 3:25 PM | Updated on Aug 28 2021 5:45 PM

ED summons Abhishek Banerjee and his wife in coal scam case - Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ, అభిషేక్ బెనర్జీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభిషేక్‌, ఆయన భార్య రుచిరా బెనర్జీకి సమన్లు జారీ చేసింది.  సెప్టెంబర్ 6 న అభిషేక్‌,  సెప్టెంబర్ 1 న రుజీరా  ఈడీ ముందు హాజరు కావాలని ఆదేశించింది.

రాష్ట్రంలో జరిగిన బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని అభిషేక్‌ దంపతులను ఆదేశించింది. అలాగే బెనర్జీల తరఫు న్యాయవాది సంజయ్ బసు సెప్టెంబర్ 3 , వీరితోపాటు ఇదే కేసులో  బెంగాల్ పోలీసు ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు  శ్యామ్ సింగ్, జ్ఞవంత్ సింగ్‌లు సెప్టెంబర్ 8 ,9 తేదీల్లోహాజరుకావాలని ఈడీ ఆదేశించింది.  కోట్లరూపాయల అవినీతి సంబంధించి  సీబీఐ (నవంబర్, 2020) దాఖలు చేసిన కేసు అధారంగా ఈ సమన్లు జారీ చేసినట్టు ఈడీ  అధికారులు తెలిపారు.ఈ కేసుకు సంబంధించిన మరికొంతమందిని కూడా వచ్చే నెలలో హాజరుకావాలని సమన్లు జారీ చేశామన్నారు. మరోవైపు ఈ ఆరోపణలను ఖండించిన అభిషేక్‌ దర్యాప్తు సంస్థల ద్వారా బీజీపీ సర్కారు తమపై వేధింపులకు పాల్పడుతోందని  అభిషేక్‌ ఆరోపించారు.  రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ పరిణామమని మండిపడ్డారు.

కాగా పశ్చిమ బెంగాల్‌లో కునుస్తోరియా, కజోరా ప్రాంతాల్లోని ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌కు(ఈసీఎల్‌) చెందిన బొగ్గు గనుల్లో బొగ్గును అక్రమంగా తవ్వుకొని, స్వాహా చేశారని ఆరోపిస్తూ సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంతో రుచిరా బెనర్జీకి, మరదలు మేనకా గంభీర్‌కు కూడా సంబంధం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. అలాగే అక్రమమైనింగ్‌ వ్యవహారంలో అభిషేక్  ప్రధాన లబ్ధిదారుని గతంలో ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement