
అన్నానగర్: ఓ యువతి తాళి కట్టే సమయంలో తనకు ఈ పెళ్లి వద్దని ఆపివేసింది. వివరాల్లోకి వెళితే.. తేని జిల్లాలోని ఆండిపట్టి ప్రాంతానికి చెందిన యువ గ్రాడ్యుయేట్ అమెరికాలోని ఒక కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతని తల్లిదండ్రులు తమ కొడుకు కోసం పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన ఒక యువతితో వివాహం కుదిర్చారు. ఈ సందర్భంలో ఇరు కుటుంబాలు అంగీకరించినందున, వివాహ వేడుక గురువారం ఆండిపట్టి ప్రాంతంలోని ఒక ప్రైవేట్ కల్యాణ మండపంలో జరగాల్సి ఉంది. అంతకుముందు, ఈ జంట బుధవారం నిశ్చితార్థ వేడుకను జరుపుకున్నారు.
ఆ సమయంలో వధూవరుల తల్లిదండ్రుల మధ్య విభేదాలు తలెత్తి, వాదనగా మారింది. సమీపంలోని బంధువులు ఇరువర్గాలను శాంతింపజేశారు. ఆ తర్వాత పెళ్లి సన్నాహాలు జోరుగా జరిగాయి. ఇదిలా ఉండగా, గురువారం ఉదయం, వధూవరులు బంధువుల చుట్టూ వివాహ వేదికపై కూర్చున్నారు. కొంతసేపటి తర్వాత, వరుడు తల్లిని తీసుకుని వధువుకు తాళి కట్టడానికి వెళ్లాడు. అప్పుడు వధువు అకస్మాత్తుగా పెళ్లి పీటల పైనుంచి లేచింది. ఈ వివాహం తనకు వద్దని, తనకు ఆసక్తి లేదని వధువు చెప్పింది. ఇది విన్న వరుడు, అతని బంధువులు దిగ్భ్రాంతి చెందారు. దీంతో వివాహం ఆగిపోయింది.