-
అయ్యో తల్లి.. ఎంత ఘోరం జరిగిపోయింది
సాక్షి, చెన్నై(అన్నానగర్): ఆర్టీసీ బస్సు ఢీకొని స్కూటర్పై వెళుతున్న అమ్మమ్మ, మనవరాలు మృతిచెందిన ఘటన తేనిలో జరిగింది. చిన్నారి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వివరాలు.. తేని జిల్లా వరుసనాడు సమీపంలోని మురుకోడై గ్రామానికి చెందిన అమావాసై, భార్య రాణి (44) కేరళ మున్నార్ సమీపంలోని బూపరాయ్ ప్రాంతంలో ఉంటూ తోట పని చేసేవారు. వీరి కుమారుడు సత్యరాజ్, కుమార్తె యోగాన కుటుంబం కూడా బూపరాయ్ ప్రాంతంలోనే ఉంటోంది. కొద్ది రోజుల క్రితం రాణి, ఆమె కుమారుడు కుమార్తె కుటుంబంతో కలిసి స్వగ్రామమైన తేని జిల్లా మురుకోడై వచ్చారు. మంగళవారం మోటారు సైకిల్, స్కూటర్పై బూపరాయ్ బయలుదేరారు. మోటారు సైకిల్ను రాణి అల్లుడు జయప్రకాష్ నడుపుతున్నాడు. అక్కడ అతని భార్య, కూతురు రుద్రశ్రీ (04), బంధువు జగతీశ్వరన్ (15) ఉన్నారు. స్కూటర్లో రాణి, ఆమె కోడలు వానతి (25), వానతి కుమారుడు ఉద్గేశ్వరన్ (07)లు వున్నారు. వానతి స్కూటర్ నడిపింది. తేని బోడి రోడ్డులోని తీర్థతొట్టి సమీపంలోని ఓ దుకాణం వద్ద ఆపి టీ తాగారు. తరువాత రుద్రశ్రీ అమ్మమ్మతో కలిసి స్కూటర్పై వెళ్లింది. తొప్పుపట్టి సమీపంలో రోడ్డు మలుపు వద్ద పెరియకుళం నుంచి వచ్చిన ప్రభుత్వ బస్సు వెనుక నుంచి ఢీకొంది. బస్సు చక్రం ఎక్కిదిగడంతో రాణి, రుద్రశ్రీ అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నారి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని తల్లిదండ్రులు రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. 108లో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తేని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. పళని శెట్టిపట్టి పోలీసులు తామరైకులంకు చెందిన బస్సు డ్రైవర్ అయ్యన్న స్వామి (52)పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. వదిలేయాలని వేడుకున్నా..) -
నివేదన ప్రేమవివాహం.. ఇంటికి వచ్చి చూసే సరికి..
సాక్షి, చెన్నై: కూతురు ప్రేమ వివాహం చేసుకుందని సోమవారం తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. పరమత్తివేలూరు తాలూకా పాండమంగళం సమీపంలోని నెట్టైయం పాళయానికి చెందిన వీరప్పన్ (55) కూలి. ఇతని భార్య భానుమతి. వీరికి నివేద (22) అనే ఏకైక కుమార్తె ఉంది. ఈమె ఎమ్.ఎస్.సి చదువుకుని ఇంట్లో ఉంటోంది. ఈక్రమంలో నివేద అదే ప్రాంతంలోని బెల్లం ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సేలం జిల్లా మకుడం చావడికి చెందిన యువరాజ్ (25)ను ప్రేమించింది. నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి వారు పెళ్లి చేసుకుని మకుడంచావడిలో నివాసం ఉంటున్నారు. ఇటీవల వీరప్పన్ తన కుమార్తె నివేదను భర్తతో కలిసి పట్టణానికి రావాలని ఆహ్వానించాడు. అయితే నివేద రావడానికి నిరాకరించింది. దీంతో వీరప్పన్ సోమవారం కుమార్తెను తీసుకురమ్మని భార్య భానుమతిని మకుడం చావడికి పంపాడు. అయితే నివేద ఇంటికి రావడానికి నిరాకరించిందని, దీంతో చేసేది లేక తిరిగి వస్తున్నానని భానుమతి భర్తకు చెప్పింది. ఇంటికి వచ్చి చూసే సరికి భర్త తాడుతో ఉరివేసుకుని ఉండడంతో వేలూరు పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వీరప్పన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. -
ఏ దిక్కూలేక తాత ఇంటికి చేరింది.. మృగాళ్లలా మారి ఆరుగురు..
మేం.. విడిపోతున్నామనే పేరుతో తల్లిదండ్రులు వదిలేశారు. ఏ దిక్కూలేని ఆ పసితల్లి దీనంగా తాత ఇంటికి చేరింది. ఒక్కపూట బువ్వకోసం ఇంటి చాకిరీ మొత్తం చేసింది. ఆ బిడ్డను చూసి జాలిపడాల్సిన లోకం పట్టించుకోలేదు. దిక్కూమొక్కులేదని తెలియడంతో అయినా వారే ఆ చిన్నారి పాలిట రాబందులుగా మారారు. కర్కశంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. కాటికి కాళ్లు చాపిన తాత.. తండ్రి తర్వాత తండ్రిగా భావించే బాబాయిలు, వరసకు సోదరులైన ఇద్దరు యువకులు తోడేళ్లుగా మారి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంతటి బాధను పంటి బిగువన భరించిన ఆ 13 ఏళ్ల బాలిక టీచర్ల సాయంతో ఆ కీచకులను కటకటాలపాలు జేసింది. సాక్షి, అన్నానగర్: కంచే చేను మేసిందన్న చందంగా.. అయినా వారే ఓ ఆడబిడ్డ పాలిట జంతువుల్లా ప్రవర్తించారు. సభ్య సమాజం తలదించుకునేలా మృగాలను తలపించారు. వివరాలు.. మైలాపూర్ ప్రాంతానికి చెందిన ఓ జంట వివాహం అనంతరం కొన్నేళ్లకు విడిపోయింది. దీంతో వీరి కుమార్తె (13) అనాథగా మారింది. నా అనేవాళ్లు లేక తాతయ్య ఇంటికి చేరింది. అక్కడే స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. అయితే ఆ బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాల్సిన కుటుంబ సభ్యులే 2016, 2017లో పలుమార్లు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాలిక పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులకు తెలియజేసింది. దీంతో పాఠశాల యాజమాన్యం జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేసింది. చివరికి ఈ అకృత్యంపై మైలాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మృగాలకు తగిన శాస్తి.. ఈ కేసు విచారణ సమయంలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. బాలికపై ఏకంగా ఆరుగురు కుటుంబ సభ్యులు నెలల తరబడి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో బలాత్కారం చేసిన ఆమె తాత, ముగ్గురు బాబాయిలు (తాత కొడుకులు), చిన్నాన కుమారులు ఇద్దరు (బాలిక సోదరులు) సహా ఆరుగురిపై పోక్సో కేసు నమోదైంది. అనంతరం వారిని అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో చెన్నైలోని పోక్సో కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాజలక్ష్మి ముందుకు మంగళవారం ఈ కేసు విచారణకు వచ్చింది. కాగా నేరం రుజువు కావడంతో బాలిక తాత, ముగ్గురు బాబాయిలకు యావజ్జీవ శిక్ష, తలా రూ. లక్ష జరిమానా, బాలిక సోదరుల్లో ఒకరికి 10 ఏళ్ల జైలుశిక్ష, మరొకరికి ఐదేళ్ల జైలుశిక్ష, తలా రూ.5,000 జరిమానా విధించారు. అలాగే బాధిత బాలికకు తమిళనాడు ప్రభుత్వం తరపున రూ. 10 లక్షలు పరిహారం ఇవ్వాలని కూడా న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఇక సమాజంలో ఏ ఆదరణ లేని బాలికల పరిస్థితి దుర్భరంగా ఉందని, తన..మన అనే భేదం లేకుండా ఇష్టారాజ్యంగా మానవ మృగాలు రెచ్చిపోతున్నాయని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. అబలల ఆక్రందనలను ప్రభుత్వాలు పట్టించుకోవాలని, ఇలాంటి విషయాల్లో పోలీసులు సైతం కఠినంగా వ్యవహరించాలని సూచించారు. నిందితులపై ఎలాంటి కనికరం చూపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. -
పెళ్లయి 13 రోజులే.. బెడ్రూంలో ఉరేసుకుని నవవధువు..
సాక్షి, చెన్నై(అన్నానగర్): తండయార్పేటలో పెళ్లయిన 13వ రోజే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చెన్నై తండయార్పేటకు చెందిన ప్రకాష్, గౌరి దంపతుల కుమార్తె రేఖ(35) రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో లేబొరేటరీ అసిస్టెంట్గా పనిచేస్తోంది. ఈమెకు టి.నగర్ గిరియప్ప రోడ్డుకు చెందిన రాజశేఖర్ (40)కు వడపళని మురుగన్ ఆలయంలో ఈ నెల 14వ తేదీ వివాహం జరిగింది. ఈ నెల 19వ తేదీ రేఖ తండయార్పేటలోని పుట్టింటికి వచ్చింది. ఆదివారం బెడ్ రూంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న ఆర్కే నగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. పెళ్లయి 13 రోజులే కావడంతో తండయార్పేట ఆర్డీఓ విచారణకు ఆదేశించారు. ఆర్కే నగర్ ఇన్స్పెక్టర్ రవి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (షూటింగ్ కోసం నెల్లూరుకు వెళ్లిన సందర్భంలో శారీరకంగా ఒక్కటై..) -
నిత్య పెళ్లికొడుకు అరెస్టు.. నాలుగు పెళ్లిళ్లు చేసుకొని..
సాక్షి, చెన్నై(అన్నానగర్): ఒకరికి తెలియకుండా మరొకరిని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. రామనాథపురం జిల్లా కడలాడి సమీపంలోని బోధికులం గ్రామానికి చెందిన సతీష్ (38) కట్టెల వ్యాపారి. అదే గ్రామానికి చెందిన రేఖను వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఆమె నుంచి విడిపోయి లతను పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత మురుగలక్ష్మితో పరిచయం ఏర్పడి ఆమెను వివాహమాడాడు. అరుప్పుకోటైలో ఆమెతో కలిసి నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో మేకలు మేపుతున్న 17 ఏళ్ల యువతితో సతీష్కి పరిచయం ఏర్పడింది. మాయమాటలు చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో తన కూతురు కనిపించడం లేదని బాలిక తండ్రి అరుప్పుకోటై తాలూకా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఉళుందూరుపేటలోని సోదరి ఇంట్లో ఉన్న బాలికను గుర్తించిన పోలీసులు ఆమెను రక్షించి విరుదునగర్లోని ఆశ్రమంలో ఉంచారు. సతీష్ అరుప్పుకోటై సమీపంలోని పాలవనత్తం ప్రాంతంలో తలదాచుకున్నట్లు బుధవారం సమాచారం అందడంతో పోలీసులు పోక్సో చట్టం కింద సతీష్ను అరెస్టు చేశారు. చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. భర్త పలుమార్లు హెచ్చరించినా..)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement