పెళ్లయి 13 రోజులే.. బెడ్‌రూంలో ఉరేసుకుని నవవధువు.. | newly married woman committed suicide in Annanagar, Chennai | Sakshi
Sakshi News home page
breaking news

పెళ్లయి 13 రోజులే.. బెడ్‌రూంలో ఉరేసుకుని నవవధువు..

Nov 29 2022 7:38 AM | Updated on Nov 29 2022 7:38 AM

newly married woman committed suicide in Annanagar, Chennai - Sakshi

సాక్షి, చెన్నై(అన్నానగర్‌): తండయార్‌పేటలో పెళ్లయిన 13వ రోజే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చెన్నై తండయార్‌పేటకు చెందిన ప్రకాష్‌, గౌరి దంపతుల కుమార్తె రేఖ(35) రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో లేబొరేటరీ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఈమెకు టి.నగర్‌ గిరియప్ప రోడ్డుకు చెందిన రాజశేఖర్‌ (40)కు వడపళని మురుగన్‌ ఆలయంలో ఈ నెల 14వ తేదీ వివాహం జరిగింది.

ఈ నెల 19వ తేదీ రేఖ తండయార్‌పేటలోని పుట్టింటికి వచ్చింది. ఆదివారం బెడ్‌ రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న ఆర్‌కే నగర్‌ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రికి  తరలించారు. పెళ్లయి 13 రోజులే కావడంతో తండయార్‌పేట ఆర్‌డీఓ విచారణకు ఆదేశించారు. ఆర్‌కే నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: (షూటింగ్‌ కోసం నెల్లూరుకు వెళ్లిన సందర్భంలో శారీరకంగా ఒక్కటై..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement