బెంగళూరు: సీఎం డీ.కే.శివకుమార్ బెంగళూరు సదాశివనగరలోని నివాసం దగ్గరలో క్షుద్ర పూజలు జరగడం కలకలానికి కారణమైంది. ఆయన నివాసానికి వెనుకవైపు జీబీఏ మైదానం ముందున్న రోడ్డులో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వృత్తాకార ముగ్గులు వేసి, కోడిని కోసి, నిమ్మకాయలు పెట్టి పూజలు చేశారు.
ఆదివారం ఉదయం ఇది చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఎంతోమంది వీఐపీలు నివసించే ప్రాంతంలో ఇలాంటిది జరిగింది.స్థానిక పోలీసులు చేరుకుని కోడి, ఇతర వస్తువులను తొలగించారు. సమీపంలోనే ముఖ్యమంత్రి నివాసముండటంతో ఈ ప్రదేశంలో భారీ పోలీస్ భద్రత ఉంటుంది. అయినప్పటికీ ఎలా క్షుద్రపూజలు జరిగాయి అనేది చర్చనీయాంశమైంది. పూజలు చేసినవారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.


