బిహార్‌లో పోలీసు స్టేషన్‌లో దొంగతనం | Bihar: Seized liquor stolen from police store room in Muzaffarpur | Sakshi
Sakshi News home page

బిహార్‌లో పోలీసు స్టేషన్‌లో దొంగతనం

Sep 25 2023 6:07 AM | Updated on Sep 25 2023 6:07 AM

Bihar: Seized liquor stolen from police store room in Muzaffarpur - Sakshi

పట్నా: దొంగలు ఏకంగా పోలీసు స్టేషన్‌ను టార్గెట్‌ చేశారు. రాత్రిపూట లోపలికి ప్రవేశించి, మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. బిహార్‌ రాష్ట్రంలోని ముజఫర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. బిహార్‌లో మద్యంపై నిషేధం అమల్లో ఉంది. అక్రమ రవాణా జరుగుతున్న మద్యం సీసాలను పోలీసులు స్వా«దీనం చేసుకొని ఈ స్టేషన్‌లోని స్టోర్‌రూమ్‌లో భద్రపర్చారు. శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది.

చిమ్మచీకట్లో దొంగలు చాకచక్యంగా గోడదూకి లోపలికి అడుగుపెట్టారు. స్టోర్‌రూమ్‌లో ఐదు పెట్టెలు, ఒక సంచిలో ఉన్న మద్యం బాటిళ్లను చోరీ చేశారు. విచిత్రం ఏమిటంటే ఈ సంఘటన జరుగుతున్నప్పుడు పోలీసు సిబ్బంది స్టేషన్‌లోనే ఉన్నారు. అసలు విషయం మరుసటి రోజు బయటపడింది. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసుల నిర్లక్ష్యంపై సోషల్‌ మీడియాలో సెటైర్లు        పేలుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement