హనుమాన్‌ విగ్రహం చోరీ.. మాయం చేసింది టీడీపీ నేతనే! | Tirumala Idol Theft: Accused Identified as TDP Leader | Sakshi
Sakshi News home page

హనుమాన్‌ విగ్రహం చోరీ.. మాయం చేసింది టీడీపీ నేతనే!

Jul 23 2026 5:35 PM | Updated on Jul 23 2026 5:55 PM

Tirumala Idol Theft: Accused Identified as TDP Leader

సాక్షి,తిరుపతి: తిరుమల కొండపై కలకలం రేపిన అంజనేయస్వామి విగ్రహం చోరీ కేసు దర్యాప్తులో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఉన్న హనుమాన్ చిన్న విగ్రహాన్ని అపహరించిన వ్యక్తిని రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

తిరుమలలో అపచారానికి పాల్పడి విగ్రహాన్ని చోరీ చేసిన నిందితుడు విశాఖపట్నం జిల్లా, భీమిలి నియోజకవర్గం, టి. నగరపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నేత పొట్నూరు యశ్వంత్‌గా  దర్యాప్తులో తేలింది. నిందితుడు యశ్వంత్‌కు టీడీపీలోని కీలక నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్,గంటా శ్రీనివాసరావు సహా పలువురు పార్టీ ముఖ్య నేతలతో యశ్వంత్ దిగిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement