చైన్నై: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. సింగంపువారి పల్లిలో నిర్వహించిన జల్లికట్టు పోటీలలో ఎద్దులు అదుపుతప్పి ప్రేక్షకుల పైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 50 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


