దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

62224 New Corona Cases Recorded In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. అయితే మంగళవారంతో పోల్చితే.. దేశంలో స్వల్పంగా కరోనా కేసులు పెరిగాయి. భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,224 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 2,542 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్‌ బారినపడి మొత్తం 3,79,573 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక గత 24 గంటల్లో 1,07,628 మంది కోవిడ్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,83,88,100  మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 8,65,432 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి.  అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో 28,00,458 మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు  26.19 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

చదవండి: Coronavirus: దేశంలో తగ్గిన కరోనా తీవ్రత

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top